ప్రభుత్వ విప్ బీర్లు ఐలయ్యను కలిసిన కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ బొమ్మలరామారం: ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ప్రభుత్వ విప్ ప్రకటించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ బొమ్మలరామారం మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు శనివారం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాంపల్లి మహేష్ గౌడ్ మాట్లాడుతూ… బడుగు బలహీన వర్గాలకు చెందిన బీర్ల ఐలయ్యకు ప్రభుత్వం ప్రభుత్వ విప్ ఇవ్వడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పైలట్ రాజేష్, భగవంతు రెడ్డి, బెత్తల శ్రీనివాస్, ప్రేమ్ కుమార్ రెడ్డి, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love