రాజగోపాల్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ భువనగిరి పార్లమెంటును రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశ భావం వ్యక్తం చేశారు. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే ఏకైక లక్ష్యంగా రాష్ట్రంలో 17కు కనీసం 15 ఎంపీ అభ్యర్థులు గెలవబోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు పరుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయాలంటేనే భయం పట్టుకుందని భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
Spread the love