ప్రత్యేక పూజలు చేసిన బీఅర్ఎస్ ఎంపీ అభ్యర్థి 

నవతెలంగాణ – మాక్లూర్

మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజి రెడ్డి గోవర్దన్, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్ ప్రత్యేక పూజలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని విఠలేశ్వర, అయ్యప్ప, ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల కార్యకర్తలతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. తను ఎంపిగా గెలిస్తే కార్యకర్త అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రజా సేవలో ముందుటనని, మి అందరితో పాత పరిచయాలు ఉన్నాయని తెలిపారు. మళ్ళీ మండలంలో ఒక్కసారి సమావేశం ఏర్పాటు చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు తిరుమల నర్సా గౌడ్, మండల కో అఫ్షన్ మెంబర్ కొక హైమద్, మాజీ సర్పంచి రాథోడ్ గంగాధర్, అబ్బన, ప్రభుత్వ ఉన్నత పాఠశాల చైర్మన్ మర్ల దాతద్రి, బిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు తాజొద్దిన్, మండల మైనార్టీ అధ్యక్షులు కరీమ్, దార్గల సాయిలు, రాచర్ల గంగాధర్, పెద్దలు, కొత్త రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love