అపురూపలో హోమం

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారులో గల అపురూప వెంకటేశ్వర ఆలయంలో సప్తాహ్నిక పుష్కర బ్రహ్మోత్సవాలు భాగంగా మూడవ రోజు హోమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఉదయం శాంతిపాఠము, వేదాది విన్నపములు, ద్వార తోరణ ధ్వజకుంభ ఆరాధన, మూర్తి కుంభ ఆరాధన, (సర్వ గ్రహ శాంతికి) మన్యుసూక్త వనం, పంచసూక్త హోమం, పూర్ణాహుతి, నివేదన, బలిహరణ, మంగళా శాసనం. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, యాగశాలార్చనలు, పూర్ణా హుతి, హనుమత్ వాహనము, నివేదన, బలిహరణ, నీరాజనం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్పర్సన్ అమృత లత, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిటీ సభ్యులు, రమాదేవి,  అర్చకులు, ప్రజలు పాల్గొన్నారు.
Spread the love