కాంట్రాక్టు ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలి

నవతెలంగాణ-భిక్కనూర్
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర కాంట్రాక్టు ప్రొఫెసర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నారాయణ గుప్తా డిమాండ్ చేశారు. మంగళవారం సౌత్ క్యాంపస్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ప్రొఫెసర్లు సీఎం కేసీఆర్ కు పోస్టుకార్డులు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా యూనివర్సిటీలలో కాంట్రాక్టు ప్రతిపాదికన పనిచేస్తున్నామని, తమ సేవలను ప్రభుత్వం తక్షణమే గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు ప్రొపెసర్లు రమాదేవి, సునీత, వైశాలి, నిరంజన్, నారాయణ పాల్గొన్నారు.

Spread the love