- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ఆదివారం మద్నూర్ నుండి బిచ్కుంద కు వెళ్తున్న స్ప్రైట్, థమ్సప్(కూల్ డ్రింక్స్) వాహనం టైరు పేలి బోల్తా పడింది. దీంతో వాహనంలోని కూల్ డ్రింక్స్ జాతీయ రహదారిపై చెల్లా చెదరుగా పడిపోయాయి. ఇందులో చాలా వరకు శీతల పానియాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన 161వ జాతీయ రహదారిపై రుశేగావ్ గెట్ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అదేవిధంగా బోల్తా పడిన వాహనాన్ని పక్కకు తరలించారు. అనంతరం కూల్ డ్రింక్స్ ఏజెన్పీ యాజమాన్యం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
- Advertisement -



