ధనుష్, ఐశ్వర్య జంటకు కోర్టు నోటీసులు

నవతెలంగాణ – చెన్నై : తమిళ స్టార్‌ హీరో ధనుష్ , సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ కు చెన్నై ఫ్యామిలీ కోర్టు నోటీసులు ఇచ్చింది. విడాకుల విషయంలో అక్టోబర్‌ 7న ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. రెండేళ్ల క్రితం ధనుష్‌ – ఐశ్వర్య జంట తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే వీరు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. సెక్షన్‌ 13బీ కింద సరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అక్టోబర్‌ 7న ధనుష్‌ – ఐశ్వర్య ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు పంపింది.

 

Spread the love