కంటోన్మెంట్‌ బీజేపీ అభ్యర్థిగా వంశా తిలక్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి బీజేపీ వంశా తిలక్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఇప్పటికే కంటోన్మెంట్‌కు బీఆర్ఎస్ నివేదిత, కాంగ్రెస్‌ నారాయణ శ్రీగణేశ్‌ను అభ్యర్థులుగా ప్రకటించాయి. మే 13న లోక్‌సభ ఎన్నికలతో పాటే ఇక్కడ పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Spread the love