కేంద్రంలో బీజేపీ ఓడిపోతుంది: సీపీఐ నారాయణ

నవతెలంగాణ – అమరావతి: కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్ ‌గేమ్ ఆడుతోందన్నారు. రాష్ట్ర ప్రజలకు మొదటి శత్రువు మోడీ అని విమర్శించారు. న్యాయవ్యవస్థను మాజీ సీజేఐ వెంకటరమణ, తెలుగు ప్రజలను వెంకయ్యనాయుడు నాశనం చేశారని దుయ్యబట్టారు. ఏపీలో ఎన్నికల హింసకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపించారు.

Spread the love