లౌకిక శక్తులకు మద్దతు: సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇండియా కూటమి విధానాల ప్రకారం లౌకిక శక్తులకు మద్దతు ఇచ్చే క్రమంలో అందులో బాగస్వామి పార్టీలు కాంగ్రెస్ బలపరుస్తున్నాయి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లయ్య అన్నారు. గురువారం మండలంలోని నందిపాడు లో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఆయన హాజరై కాంగ్రెస్ అభ్యర్థి  రామ సహాయం రఘు రామిరెడ్డి ని గెలిపించాలని కోరారు. ఈ సమావేశం లో మండల కార్యదర్శి బి.చిరంజీవి పాల్గొన్నారు.
Spread the love