BRS NRI కువైట్ ఆధ్వర్యంలో దీక్షా దివస్…

నవతెలంగాణ హైదరాబాద్: BRS NRI కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో దీక్షా దివస్ ని నిర్వహించారు. తెలంగాణ చరిత్రనే మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 ఐతే తెలంగాణ రథ యాత్ర లేదా కేసీఆర్ శవయాత్ర, ఎత్తిన జెండా దించినా , ఉద్యమాన్ని ఆపినా నన్ను రాళ్లతో కొట్టి చంపండి, ఆంధ్ర ప్రదేశ్ నుంచి వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రంలోనే అడుగు పెడ్త, తెలంగాణ వచ్చుడ్డో కెసిఆర్ సచ్చుడో అంటూ ఎన్నో శపదాలతో చేపట్టిన ఆమరణ దీక్ష పల్లెల్లో, పట్టణాల్లోని విద్యార్థుల్లో మరింత ఉరకలు వేసే విధంగా చేసింది. చావు నోట్లో తలపెట్టి  మరి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు . ఆయన స్పూర్తితో నేను కూడా నా ఎంబీఏలో మా యూనివర్సిటీలో పోరాటం చేసినందుకు చాలా గర్వంగా ఉంది అని అభిలాష అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అమరులు ప్రాణ త్యాగం చేశారు వారందరినీ స్మరించుకుంటూ, అందులో మొదటి అమరుడైన శ్రీకాంతాచారి కూడా నవంబర్ 29నే రోజే ప్రాణత్యాగం చేసి మరింత స్ఫూర్తి ని నింపారన్నారు. కేటీఆర్ గారు గల్ఫ్ భీమా ప్రకటించినందుకు BRS NRI కువైట్ తరుపున  గల్ఫ్ కార్మికుల తరుపున కృతజ్ఞతలు. తొందర్లోనే గల్ఫ్ పాలసినీ కూడా అమల్లోకి తెస్తాం అని ప్రకటించినందుకు చాలా సంతోషం, త్వరగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. గత 6 దశాబ్దాల లో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదిన్నరేండ్లలో చేసి చూపించారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అభివృద్ధి కొనసాగాలంటే కేవలం కెసిఆర్ వల్లనే సాధ్యం అవుతుంది అని తెలిపారు. కెసిఆర్ గెలుపు రిపీట్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ అంటూకేసీఆర్ పక్కా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని BRS NRI కువైట్ తరుపున ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో BRS NRI కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, ప్రమోద్ కుమార్ మార్క, సురేష్ గౌడ్, అయ్యప్ప, సమియుద్దిన్, జమీల్, రవి సూర్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love