నవతెలంగాణ -హైదరాబాద్: యూపీ లిక్కర్ కింగ్కు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన అక్రమ ఫామ్హౌస్ను అధికారులు కూల్చేశారు. ఈ ఘటన దిల్లీ పరిధిలో చోటు చేసుకొంది. స్థానిక ఛత్రపుర్ ప్రాంతంలోని లిక్కర్ వ్యాపారి పాంటీ చద్దా కుటుంబానికి చెందిన ఓ ఫామ్ హౌస్ ఉంది. దీని విలువ రూ.400 కోట్లు పైమాటే. దిల్లీ డెవలప్మెంట్ అథారిటీ సిబ్బంది శుక్రవారం, శనివారం సామగ్రితో తరలివచ్చి దీనిని పూర్తిగా నేలమట్టం చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇది చద్దా కుమారుడు మన్ప్రీత్ అలియాస్ మాంటీ కబ్జాలో ఉంది. పాంటీ, అతడి చిన్న తమ్ముడు హర్దీప్ మధ్య ఇదే ఫామ్హౌస్లో గొడవ జరిగింది. ఆ సమయంలో హర్దీప్ తుపాకీతో కాల్చి అతడిని చంపాడు. తర్వాత చద్దా అంగరక్షకుడు హర్దీప్ను కాల్చేశాడు.