ధ్వంసం అయిన అంతర్గత రోడ్లు..

– పొంచి ఉన్న ప్రమాదం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇటీవల సంభవించిన మీచౌంగ్ తుఫాన్ తో చేతికందిన పంటలు తో పాటు ఇటీవల నిర్మించిన అంతర్గత రహదారులు సైతం ధ్వంసం అయ్యాయి.దీంతో ఆయా మార్గాల్లో ప్రయాణం చేసే వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది.అయినా సంబంధిత శాఖల అధికారులు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదు. మండలంలోని నారంవారిగూడెం నుండి మొద్దులు గూడెం మధ్య ఉన్న కల్వర్టు పూర్తిగా ధ్వంసం అయింది.ఈ వరద తాకిడికి పెద్ద వృక్షం సైతం వేర్లు తో సహా విరిగిపోయింది. నారంవారిగూడెం నుండి గుర్రాలు చెరువు దారిలో రెండు కల్వర్టు లు సమీపంలో రహదారి పూర్తిగా శిధిలం అయింది. ఈ రెండు మార్గాలు లో ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని, తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Spread the love