చెన్నై బ్యాట్స్ మెన్ల విధ్వంసం..ఢిల్లీకి భారీ టార్గెట్

నవతెలంగాణ-హైదరాబాద్ :  చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్(79) ,డేవాన్ కాన్వే(87) విజృంభించడంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. దీంతో ఢిల్లికి 224 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దోని సేన ఆరంభం నుంచి ఓపెనర్లు ఢిల్లీ బౌలర్ల మీద విరుచుకుపడ్డారు. ఓపనర్లు ఇద్దరు అర్ద సెంచరీలు చేశారు దీంతో చెన్నై భారీ స్కోరు దిశగా సాగింది. శివమ్ దూబ్ 9 బంతుల్లో 22 పరుగులు చేయగా చివర్లో జడేజా 7 బంతుల్లో  20 పరుగులు చేయడంతో 223 పరుగులు చేసింది.

Spread the love