స్పీకర్ ను కలిసిన చెస్ క్రీడాకారుడు ప్రణీత్

నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ పట్టణంలోని స్పీకర్ నివాసంలో శనివారం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని అంతర్జాతీయ  చెస్ క్రీడాకారుడు నల్గొండ జిల్లాకు చెందన ఉప్పల ప్రణీత్ మర్యాద పూర్వకంగా కలిశాడు.. ఈ సందర్భంగా స్పీకర్ ఉప్పల ప్రణీత్ ను అభినందించి భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కపూర్ క్రీడలను ఏర్పాటు చేసిందని అందరూ పాల్గొని వారి ప్రతిభను కనబరిచారన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రాష్ట్రస్థాయికి ఆటలాడే అవకాశం సీఎం అవకాశం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ప్రణీత్ తండ్రి ఉప్పల శ్రీనివాస్, రైతు నగర్ సర్పంచ్ నాగేశ్వరరావు, తిమ్మాపూర్ సర్పంచ్ రాంబాబు తదతరులు పాల్గొన్నారు.

Spread the love