హైదరాబాద్ ఈ ఎన్ సి కార్యాలయంలో అధికారులను కలిసిన

– బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చా ర్జి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్.
– చెరువులకు మరమ్మత్తులు చేయించి సాగునీరు అందించాలి
– ఈఎన్‌సీలకు విన్నవించిన జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
నవతెలంగాణ – మంథని
మంథని నియోజకవర్గంలోని తూర్పు డివిజన్‌ ప్రాంతంలోని చెరువులకు మరమ్మత్తులు చేయించి పంట భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఈఎన్‌సీలకు మంథని నియోజకర్గ భిఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి,పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ వినతి పత్రం అందజేసి కోరారు.హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ జలసౌధలో ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, వెంకటేశ్వర్లను మర్యాద పూర్వకంగా కలిసి పంటల సాగుకు సాగునీరు అందించేందుకు సహకారం అందించాలని కోరారు.కాటారం మండలంలోని గూడూరు,బస్వాపూర్‌, వీరాపూర్‌,ఒడిపిలవంచ చెరువులకు మరమ్మత్తులు చేయించి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ చెరువులకు మరమ్మత్తులుచేయిస్తే అనేక ఎకరాల భూములు సాగులోకి వస్తాయని, చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుందని ఆయన వివరించారు. కాటారం మండలంలోని రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన ఈసందర్బంగా వారికి విన్నవించారు.వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నియోజకవర్గంలో బీడు భూములకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి సాగులోకి తీసుకువచ్చి సశ్యశ్యామలం చేయాలని,ఇందుకు అవసరమైన కృషి చేయాలని ఆయన వారిని కోరారు.

 

 

Spread the love