నవతెలంగాణ – హైదరాబాద్: తిరుమల క్షేత్రంలో వరుసగా మూడో రోజు కూడా వర్షం కురిసింది. ఇవాళ మధ్యాహ్నం వడగళ్లతో కూడిన వాన పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న భక్తులు వర్షంతో ఉపశమనం పొందారు. గురువారం నుంచి తిరుమల కొండపై వర్షాలు కురుస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో, ఈ వర్షాలతో తిరుమలలో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.