నర్సింగాపూర్లో గద్దర్ సంస్మరణ సభ

నవతెలంగాణ-వీణవంక
మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ ఆత్మదిన సభను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గద్దర్ చిత్రపటం ఏర్పాటు చేసి అక్కడ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన పాడిన పాటలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దాసారపు శ్రీనివాస్, కొలుగూరి రజినీకాంత్, దాసారపు గురువయ్య, కండె మహేందర్, అంతడుపుల సంపత్, దాసారపు సతీష్, దర్షణాల చంద్రమోహన్, బోయిని పోచయ్య, కండె సమ్మయ్య, స్వామి, భద్రయ్య, పూర్ణ చందర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love