ఉపాధి హామీ పనిచేస్తుండగా కూలి మృతి..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

ఉపాధి హామీ పనిచేస్తూ ఉన్నట్టుండి రైతు కుప్పకూలి మృతిచెందిన సంఘటన శనివారం రోజు ఉదయం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జప్తి జాన్కంపల్లి గ్రామానికి చెందిన భూమని రాములు (71) శనివారం ఉదయం జప్తి జానకంపల్లి శివారులో మల్లార్ చెరువులో ఉపాధి హామీ పనులు చేయడానికి వెళ్లడం జరిగింది. భూమని రాములు తన భార్య సాయవ్వ తో కలసి పనిచేస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలాడు ఇది గమనించిన తోటి కూలీలు సంఘటన స్థలానికి చేరుకొని పరీక్షించగా మృతి చెందినట్లు నిర్ధారణ కావడం జరిగింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచినామ నిర్వహించి శవాన్ని ఎల్లారెడ్డికి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఉపాధి హామీ వద్ద సంఘటన జరగడంతో గ్రామస్తులందరూ కన్నీరు మున్నీరయ్యారు.
Spread the love