గోదావరిలో భక్తుల పుణ్య స్థానాలు

నవతెలంగాణ – రెంజల్
రెంజల్ కందకుర్తి గోదావరి త్రివేణి సంగమం భక్తులతో కిటకిట లాడింది. శుక్రవారం మాఘమా అమావాస్య రావడంతో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసి, తమ పుణ్య స్థానాలను ఆచరించారు. గోదావరిలో ఉన్న రాతి శివాలయంతో పాటు పుష్కర ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పిండివంటలను తయారు చేసి, నైవేద్యాన్ని తేప్పలో ఉంచి, గోదారిలో విడిచి తమ మొక్కలను తీర్చుకున్నారు. దూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు అక్కడే వంటలు చేసుకొని భోజనాలను  చేశారు.

Spread the love