ధర్మ ప్రచార సంఘం రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం

నవతెలంగాణ  -పెద్దకొడప్ గల్
తెలుగురాష్ట్రాల వీర శివలింగాయత్ ధర్మ ప్రచార సంఘం అధ్యక్షుడిగా నియమించ బడిన  కామారెడ్డి జిల్లా వీర శైవ లింగాయత్ అధ్యక్షులు కే.దిగంబర్ ను గురువారం కామారెడ్డి జిల్లా వీర శైవ లింగాయత్ కార్యదర్శి మల్లప్ప పటేల్ శాలువకప్పి సన్మానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ప్రతి ఒక్క లింగాయత్ సోదరుడు లింగాయత్ ధర్మాన్ని పాటించే విధంగా చూస్తామని తెలిపారు.బసవేశ్వరుని స్పూర్తిగా తీసుకుని కులమతాలకతీతంగా సమాజసేవ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ నాయకులు బి.గంగారాం పాల్గొన్నారు.
Spread the love