- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని రామరావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2026-27 విద్య సంవత్సరానికి గాను విద్యార్థులకు నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలను గురువారం పంపిణీ చేసినట్లుగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా హెచ్.ఎం మాట్లాడారు. ప్రయివేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, ఉచితంగా నోట్ బుక్స్, ఏకారుప దుస్తులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



