యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం

నవతెలంగాణ – డిండి
యూత్ కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం లో భాగంగా డిండి మండలం ప్రతాప్ నగర్ గ్రామంలో ఆదివారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ఆదేశంతో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జరుపుల లక్ష్మీతిరుపతి ఆధ్వర్యంలో ప్రతాప్ నగర్ గ్రామ పంచాయతీ లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు చేసిన ఫలితమే అత్యధిక స్థానాలతో కాంగ్రెస్ పార్టీనీ గెలిపిస్తుందన్నారు. భారతదేశం ముఖ్యంగా శ్రమ జీవులతో, రైతులతో నిండినది రైతుల మేలుకోరే కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఋణమాఫీ ప్రకటించిందన్నారు. భవిష్యత్తులో కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీనీ చేయడానికి ప్రతి ఒక్కరు కంకణబద్ధులై ఉండాలి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని గెలిపించాలన్నరు. కాంగ్రెస్ పార్టీ అంటే మహిళా మేలు కోరేపార్టీ, పేదల అండ అని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పెట్టింది పేరు అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్ మెంబెర్ శాంతి, సోషల్ మీడియా మండల కో-ఆర్డినేటర్ కేతావత్ గణేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, యం. నిరంజన్, లాలు, కలానందం, పత్య, ఇద్దిరాములు, జింకలా లక్ష్మయ్య, చిన్న నిరంజన్, కొండ్రపల్లి బాబు, నామ్య, కిషన్, నగేష్,లోక్య, పి. అంజి, దశరథం, వెంకటయ్య, శ్రీను వేముల రాజు, అంజి తదితరులు పాల్గొన్నారు.
Spread the love