టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలకు ఆహ్వాన కమిటి ఎన్నిక

– అధ్యక్షులుగా ప్రముఖ వైద్యులు కూరపాటి ప్రదీప్‌
– ప్రధాన కార్యదర్శిగా వనం, కోశాధికారిగా ఏనుగు
– సలహాదారుడిగా కే. రాంనారాయణ
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మంలో ఈనెల19, 20వ తేదిల్లో రెండు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా జరగనున్న తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (టీయుడబ్ల్యూజే-ఐజేయూ) రాష్ట్ర మూడవ మహాసభలకు ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ప్రముఖ పిల్లల వైద్యనిపుణులు, సామాజీకవేత్త కూరపాటి ప్రదీప్‌, ప్రధాన కార్యదర్శిగా టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, కోశాధికారిగా టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్‌రావు, సలహాదారుడిగా టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాంనారాయణలతోపాటు జిల్లాకు చెందిన టియుడబ్ల్యుజె ఐజెయు జిల్లా ,రాష్ట్ర నాయకులు, ప్రముఖ జర్నలిస్టులు, ట్రేడ్‌ యూనియన్‌ నేతలు మొత్తం 150మందితో ఈ కమిటిని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో టియుడబ్ల్యుజె జిల్లా నాయకులు కే.రవింద్ర శేషు, నర్వనేని వెంకట్రావ్‌, మాటేటి వేణుగోపాల్‌, నల్లజాల వెంకట్రావ్‌, సామినేని మురారీ, మైసపాపారావు, ఖదీర్‌, ఆవుల శ్రీనివాస్‌, కనకం సైదులు, మామిడాల భూపాల్‌, గోగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌, మైనోద్దిన్‌, నామపురుషోత్తం, శివానంద, జనార్దనాచారి, కెవి, చెరుకుపల్లి శ్రీనివాస్‌, ఏలూరి వేణుగోపాల్‌ రావు, కళ్యాణ్‌, అలస్యం అప్పారావు, జకీర్‌, కమటం శ్రీనివాస్‌, జిల్లా, నగర కమిటీ సభ్యులు, ఎలక్ట్రానిక్‌ మీడియా, వీడియోజర్నలిస్ట్‌ యూనియన్‌, ఫోటోగ్రాఫర్‌ అసోసియేషన్‌ నేతలు, పలు ట్రేడ్‌ యూనియన్‌ నేతలు తదితరులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మహాసభలకు రెండు పర్యాయాలు అతిధ్యం ఇచ్చిన ఖమ్మ జిల్లా, తెలంగాణ ఏర్పాటు తరువాత తొలిసారిగా రాష్ట్ర మూడవ మహాసభకు మరోసారిఅతిధ్యం ఇవ్వబోతుందని, రాష్ట్ర డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క్‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుతోపాటు మీడియా అకాడమి చైర్మెన్‌ కె. శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిలు రేణుకచౌదరి, రామసహాయం రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్‌ పార్ధసారధిరెడ్డి, మాజీ ఎంపి నామ నాగేశ్వర్‌ రావు, ఎమ్మెల్సీ తాతామధు, జెడ్పి చైర్మెన్‌ లింగాల కమల్‌ రాజు, నగర మేయర్‌ పునుకొల్లు నిరజ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభధ్రం, సిపిఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, తానా మాజీ అధ్యక్షులు జయశేఖఱ్‌ తాళ్ళూరి, ఐజెయు నాయకులు బల్విందర్‌ సింగ్‌ జమ్ము, ఎస్‌ఎన్‌ సిన్హా, దేవులపల్లి అమర్‌, ఎంఏ మాజీద్‌, వై.నరేందర్‌రెడ్డి, డి.సోమసుందర్‌, కల్లూరి సత్యనారాయణ, అలపాటి సురేశ్‌ కుమార్‌, నగునూరి శేఖర్‌,కె విరాహత్‌ అలీ తదితర నాయకులు పాల్గొంటారని తెలిపారు.
8 సబ్‌ కమిటీల ఏర్పాటు
రాష్ట్ర మహాసభల విజయవంతం కోసం పలువురు సీనియర్‌ జర్నలిస్టులతో 8 కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా టియుడబ్ల్యుజె (ఐజెయు) అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్ల, ఏనుగు వెంకటేశ్వర్‌ రావు తెలిపారు. ఫూడ్‌ కమిటీ కన్వీనర్‌గా సామినేని మురారీ, వసతుల కమిటీ కన్వీనర్‌గా మాటేటి వేణుగోపాల్‌, ప్రోటోకాల్‌ కమిటి కన్వీనర్‌గా నర్వనేని వెంకట్రావ్‌, ఫైనాన్షియల్‌ కమిటి కన్వీనర్‌గా ఏనుగు వెంకటేశ్వర్‌ రావు, కో కన్వీనర్లుగా వనం వెంకటేశ్వర్లు, మాటేటి వేణుగోపాల్‌, ప్రచార కమిటి కన్వీనర్‌గా మైస పాపారావు, మెమోంటోస్‌ ఆండ్‌ గిప్ట్‌ కమిటి కన్వీనర్‌ గా నల్లజాల వెంకట్రావ్‌, మీడియా కమిటి కన్వీనర్‌గా మోహినోద్దిన్‌, కో కన్వీనర్‌గా నామ పురుషోత్తం, రవాణ కమిటి కన్వీనర్‌గా చెరుకుపల్లి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ప్రతి కమిటీలో అయిదుగురు నుంచి 8మంది సభ్యులు ఉన్నారు. ఆయా కమిటీలు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నాయి. జిల్లాకు విచ్చేసే ప్రతినిధులకు ఏలాంటి లోటుపాట్లు లేకుండా చక్కని అతిధ్యం ఇచ్చేందుకు కమిటీలు చురుకుగా పనిచేస్తున్నాయని తెలిపారు.

Spread the love