రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. మే నెలలో సినిమాను విడుదల చేయటానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ మూవీ టీజర్ను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి చిత్రయూనిట్కి అభినందనలు తెలియజేశారు. ఇది పక్కా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని టీజర్ చెప్పకను చెప్పింది. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో సంసారాన్ని వెల్లదీస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందిందని టీజర్ ద్వారా స్పష్టమవుతుంది. ఈ సందర్బంగా నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ, ”మా ‘సారంగదరియా’ టీజర్ను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణుకి ప్రత్యేక ధన్యవాదాలు. హదయాన్ని హత్తుకునే భావోద్వేగాలుంటాయి. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం’ అని తెలిపారు. ‘దర్శకుడిగా ఇది నా తొలి చిత్రం. ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో కథ ఉంటుంది’ అని డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి (పండు) అన్నారు.