- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట్ మండలం ఉపాధి హామీ(MGNREGS) టెక్నికల్ అసిస్టెంట్, ఇంచార్జ్ ఈసీ శైలజ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి మృతికి తెలంగాణ ఎస్.ఆర్.డి.ఎస్ జేఏసీ ఛైర్మన్ ఎలభద్రి లింగయ్య, కో-చైర్మన్లు వెంకట్ రామ్ రెడ్డి, విజయ్, అంజిరెడ్డి, మోహన్ రావు,MGNREGS టెక్నికల్ అసిస్టెంట్స్ జిల్లా అధ్యక్షులు పి.జగన్, ఉపాధ్యక్షులు నరేష్, కార్యదర్శి ఎస్.మధు, MGNREGS ఈసీల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జే.సత్యనారాయణ, ఏ.రాజామోగిలిలు సంయుక్త ప్రకటనలో సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -



