- Advertisement -
నవతెలంగాణ-ఆలేరుటౌను
మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని, ఆలేరు మున్సిపల్ చైర్మన్ బిజన బాలమణి భాస్కర్ అన్నారు. ఆలేరు పట్టణంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల తో నిర్వహించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ కమిషనర్ కె శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ జగన్మోహన్, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
- Advertisement -



