నామినేటెడ్ పోస్టులకు ఎసరు …?

నవతెలంగాణ అచ్చంపేట: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో.. అచ్చంపేట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ గెలుపొందడంతో నియోజకవర్గంలోని నామినేటెడ్ పోస్టులకు ఎసరు పడనుంది. నామినేటెడ్ పదవుల్లో ఉన్న వ్యక్తులు పార్టీ మారాలన పదవులు వదులుకోవాలని ఆలోచనలు సందిగ్ధంలో ఉన్నారు. అచ్చంపేట మార్కెట్ చైర్మన్, ఉమామహేశ్వరం దేవస్థాన చైర్మన్, మద్దిమడుగు ఆలయ కమిటీ చైర్మన్, మామిళ్ళపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చైర్మన్, పాలసితిలీకరణ కేంద్రం చైర్మన్ మొదలగు నామినేటెడ్ పదవులకు ఏసరు పడనుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గెలుపుకు కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Spread the love