దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి దళిత బంధు వర్తింప చేయాలి..

– సిపిఐ(ఎం) నాయకులు చిరంజీవి
నవతెలంగాణ – అశ్వారావుపేట :
రాజకీయాలకు అతీతంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి దళిత బంధు వర్తింప చేయాలని,పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధి దారులను ఎంపిక చేయాలని సిపిఐ(ఎం) జిల్లా నాయకులు బి.చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం దళిత బంధు పధకం పై ఎంపిపి శ్రీరామమూర్తి,ఎం.పి.డి.ఒ శ్రీనివాసరావు కు ఆయన వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత లబ్ధిదారులు అందరూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలకు చెందిన వారే అని ఆవేదన వ్యక్తం చేసారు.ఈ సారైనా సామాన్య దళితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love