బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు

నవతెలంగాణ తుంగతుర్తి:
తుంగతుర్తి నియోజకవర్గంలోని మద్దిరాల, తుంగతుర్తి, నూతనకల్, నాగారం మండలాల్లో శుక్రవారం ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపులపై దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నూతనకల్ మండలంలోని కొత్తతండ, భాగ్యతండ, దిర్శనపల్లి తండ,బిక్కుమల్ల గ్రామాలలో రైడింగ్ నిర్వహించి 5లీటర్ల సారా, 50 కేజీల నల్ల బెల్లం, 500 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా పసునూరు, వెంపటి గ్రామాలలో బెల్ట్ షాపులపై తనిఖీలు నిర్వహించి 10లీటర్ల మద్యం, 5.8 లీటర్ల బీర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ముగ్గురిని నూతనకల్ తాసిల్దార్ ముందు బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ బాలాజీ నాయక్, ఎస్సైలు మూర్తి, గణేష్, తోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love