ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు 19 వరకు పొడిగింపు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజు చెల్లింపు గడువును ఈనెల 19వ తేదీ వరకు చెల్లించేందుకు గడువును పొడిగించామని తెలిపారు. ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈనెల 19వ తేదీ వరకు ఫీజు తీసుకోవాలని ఆదేశించారు.
రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ గడువు 17 వరకు పెంపు
ఇంటర్‌ విద్యార్థుల రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు గడువును ఈనెల 17వ తేదీ వరకు పెంచామని నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. విద్యార్థుల నుంచి విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Spread the love