– రన్నరప్తో సరిపెట్టిన సింధు
– మలేషియా మాస్టర్స్ సూపర్ 500
కౌలాలంపూర్ (మలేషియా) : భారత బ్యాడ్మింటన్ స్టార్ పి.వి సింధుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ సీజన్లో తొలి టైటిల్ విజయం కోసం ఎదురుచూస్తున్న తెలుగు తేజం.. మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లో ఆఖరు అడుగులో తడబడింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో పి.వి సింధు మూడు గేముల పోరాటంలో పరాజయం పాలైంది. సుమారు గంటన్నర పాటు సాగిన టైటిల్ పోరులో చైనా షట్లర్, రెండో సీడ్ జాంగ్ జి యు విజయం సాధించింది. 21-16, 5-21, 16-21తో పి.వి సింధు ఓటమి చెందింది.