పిడ్స్ తో రైతు మృతి

నవతెలంగాణ – దుబ్బాక రూరల్
పీడ్స్ వచ్చి రైతు మృతి చెందిన ఘటన దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభునిపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మండల రాజు(43) అనిత, దంపతులు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, కొడుకు ఉండగా.. ఇటీవల కూతురు వివాహం చేశాడు. సోమవారం ఫీడ్స్ వచ్చి వారి ఇంటీ సమీపంలో రోడ్డు పై పడిపోగా తలకు తీవ్ర గాయమైంది. కుటుంబీకులు  వెంటనే అప్రమత్తమై సిద్దిపేట ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వెను వెంటనే గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా హైద్రాబాద్ గాంధీ ఆస్పత్రి నుండి గురువారం మృతదేహన్ని కుటుంబీకులు ఇంటికి తీసుకువచ్చి దహన సంస్కారాలు నిర్వహించారు. రైతు రాజు మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకోగా కుటుంబీకులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మరో వైపు రైతు రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Spread the love