బక్రీద్‌ పండుగ రోజున దారుణం.. ఇద్దరు ముస్లి యువకులు మృతి

నవతెలంగాణ- నిర్మల్‌ : బక్రీద్‌ పండుగ రోజున దారుణం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ముస్లి యువకులు దుర్మరణం చెందారు. బక్రీద్‌ పండుగ రోజున దుర్ఘటన జరగడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. కడెం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ సమియోద్దీన్, మహ్మద్ జిహాన్ అనే ఇద్దరు బైక్ పై వెళ్తుండగా పెద్ద బెల్లాల్ శివారులోని చెరువు వద్ద మూల మలుపున చెట్టుకు ఢీ కొన్నారు. దీంతో సయ్యద్ సమియోద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మహ్మద్ జిహాన్ ను ఖానాపూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

Spread the love