పాముకాటుతో రైతు మృతి..

నవతెలంగాణ-భిక్కనూర్
పాముకాటుతో రైతు మరణించిన సంఘటన మండలంలోని అంతంపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శంకర్ (59) ఆదివారం మధ్యాహ్నం తన వ్యవసాయ భావి వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి రాత్రి భోజనం చేసి పడుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో నోట్లో నుండి నురుగు రావడంతో గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళుతున్న సమయంలో మార్గమధ్యలో మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు.

Spread the love