సైకిల్‌పై తండ్రీ కూతుళ్ల చార్‌ధామ్‌ యాత్ర

సైకిల్‌పై తండ్రీ కూతుళ్ల చార్‌ధామ్‌ యాత్ర– ఎనిమిదేండ్ల కూతురితో కలిసి ద్వారక, బద్రీనాథ్‌ క్షేత్రాలు సందర్శన
సూరత్‌ : గుజరాత్‌కు చెందిన తండ్రీకూతుళ్లు సైకిల్‌పై చార్‌ధామ్‌ యాత్రను కొనసాగిస్తున్నారు. తన ఎనిమిదేండ్ల కుమార్తె కంగర్‌ కష్ణతో కలిసి తండ్రి అశోక్‌ జీనా బారు ద్వారక, బద్రీనాథ్‌ క్షేత్రాలను దర్శించుకున్నారు. త్వరలో నేపాల్‌లోని పశుపతినాథ్‌, రామేశ్వరంలోని శివుణ్ని దర్శించుకోనున్నట్లు తెలిపారు. అలాగే గుజరాత్‌లో అనాథ పిల్లలకు అండగా నిలుస్తూ, పేదలకు సాయం చేస్తున్న సామాజిక కార్యకర్త నితిన్‌ జానీ కోసం ప్రార్థించేందుకే ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపారు. సైకిల్‌పై గుజరాత్‌ నుంచి బయలుదేరిన వీరు దాదాపు 1,400 కి.మీ. ప్రయాణించి ఉత్తరాఖండ్‌కు చేరుకొన్నారు.

Spread the love