తనయుని గెలుపు కోరుతూ తండ్రి ప్రచారం

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండలంలోని ఎం.తుర్కపల్లి గ్రామంలో  కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోరుతూ  ఆయన తండ్రి చామల వాసుదేవ రెడ్డి మాజీ సర్పంచ్ తుమ్మల పద్మమ్మ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల యుగంధర్ రెడ్డి తో కలిసి గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి ఆయన తన కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బట్టు ఎల్లయ్య, పల్సం పాండరి, బట్టు రాజు, పల్సం రవి, గుండు  జగన్మోహన్ రెడ్డి, గుండు వెంకటరెడ్డి, తుమ్మల మధుసూదన్ రెడ్డి, తుమ్మల సత్యనారాయణ రెడ్డి, బత్తిని నగేష్, బట్టు అంజి తదితరులు పాల్గొన్నారు.
Spread the love