బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూర్ పట్టణానికి చెందిన ఆటో యూనియన్ నాయకుడు అంబల్ల రాజమల్లు అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజమల్లు ఇంటికి చేరుకొని ఆయన మృతదేహానికి నివాళులు అర్పించి, అంతక్రియల కోసం తక్షణ సాయంగా 5 వేల రూపాయల నగదును పార్టీ తరపున కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందే దయాకర్ రెడ్డి, తాటిపాముల లింబాద్రి, సిద్దా గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, సొసైటీ డైరెక్టర్ సాజిద్, దుంపల మోహన్ రెడ్డి, ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు.

Spread the love