ఉరి వేసుకుని రైతు ఆత్మహత్య..

నవతెలంగాణ- రామారెడ్డి
యాసంగి పంట వరి ధాన్యం దిగుబడి రాకపోవడంతో, కూతురు చదువులు, భవిష్యత్తును ఆలోచిస్తూ, మనస్థాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని రైతు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండల కేంద్రానికి చెందిన బచ్చ బోయిన రాములు (61) భార్య లక్ష్మీ గురువారం వేములవాడ దేవాలయానికి వెళ్ళగా, ఇంట్లో ఎవరు లేకపోవడంతో సీలింగ్ ఫ్యాన్ కు బట్టతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏ ఎస్ ఐ సుభాషిని తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Spread the love