10 జీపీఎస్ సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

నిజాంబాద్ జిల్లా జక్రాన్ పెళ్లి మండలం పడకల్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో గోర్తి ఈశ్వర ట్రస్టు నిజాంబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పాటుకూరి తిరుపతి రెడ్డి  ఆధ్వర్యంలో ట్రస్టు వ్యవస్థాపకులు శ్రీమతి ఉషాబాల పవన్ కుమార్ గార్ల సహకారంతో టెన్త్ క్లాస్ లో పదికి పది వచ్చినటువంటి విద్యార్థులు హర్షిక, శంకర్ గారికి రూ.12500 వేల చొప్పున ఇద్దరికీ కలిపి రూ.25 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో ట్రస్టు రెండు జిల్లాల బాధ్యులు పాటుకురి తిరుపతి రెడ్డి, స్థానిక ప్రధానోపాధ్యాయులు సురేందర్ రెడ్డి,  ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు .
Spread the love