భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామానికి చెందిన మహిళ రైతు పల్లేరు అంజమ్మ (60) అనారోగ్యంతో మృతిచెందగా, చందుపట్ల బ్యాంకు తరఫున కుటుంబానికి బ్యాంకు చైర్మన్ మందడి లక్ష్మి నరసింహ రెడ్డి రూ.30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు పల్లెర్ల స్వామి, అంగడి బాలమ్మ, సంఘ సిబ్బంది సీఈఓ దంతూరి నర్సింహ్మ, బోడ సంజీవ, సభ్యులు,రైతులు పాల్గొన్నారు.