‘గోవిందరాజస్వామి’ సమీపంలో అగ్నిప్రమాదం

తిరుపతి: తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని లావణ్య ఫొటో ఫ్రేమ్‌ వర్క్స్‌ దుకాణంలో విద్యుదాఘాతంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడడంతో ఆలయ యాత్రికులు, దుకాణాదారులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు. భవనం ముందున్న ద్విచక్ర వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. పరిసర ప్రాంతాల్లోని షాపులన్నీ మూసివేయడంతో పాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో దాదాపు రూ.50 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, టీటీడీ ఎవి ధర్మారెడ్డి, జెఇఒ వీరబ్రహ్మం, మేయర్‌ డాక్టర్‌ శిరీష, కమిషనర్‌ హరిత, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

 

Spread the love