భువనగిరి మండలంలోని నమాత్ పెళ్లి గ్రామంలో మంగళవారం స్వయంభు శ్రీ పూర్ణగిరి సుదర్శన లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఉదయం 5 గంటలకు గిరిప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ అతికం లక్ష్మీనారాయణ గౌడ్, నరసింహ ఉపాసనకులు, బత్తిని రాములు స్వామి, ఆలయ పూజారి పవన్ కుమార్ శర్మ, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.