వేడినీటి పైపులైన్‌ పేలి నలుగురు మృతి..70 మందికి గాయాలు

నవతెలంగాణ-హైదరాబాద్ : రష్యా రాజధాని మాస్కోలోని ఓ షాపింగ్‌ మాల్‌లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించారు. మాస్కోలోని ద సీజన్స్‌ అనే షాపింగ్‌ మాల్‌లో ఒక్కసారిగా వేడి నీటి పైప్‌లైన్‌ పగిలిపోయింది. దీంతో నలుగురు మృతిచెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారని నగర మేయర్‌ సెర్జీ సోబ్యానిన్‌ తెలిపారు. చాలామంది కాలిన గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించామన్నారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని వెల్లడించారు.

Spread the love