- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండల పరిధిలోని కంఠాలి గ్రామంలో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం విజయవంతమైందని జుక్కల్ ప్రభుత్వాస్పత్రి వైద్యుడు విట్టల్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నివారణ, పరిశుభ్రత, తాగునీటి వినియోగం, దోమల నివారణ, వ్యక్తిగత ఆరోగ్యంపై గ్రామ ప్రజలకు వైద్యులు అవగాహన కల్పించారు. అలాగే ఈ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విలువైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైద్యులు, నర్సులు, సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
- Advertisement -



