– జమతే-ఏ ఉల్మా అధ్యక్షులు మహ్మద్ ఖళీమోద్దీన్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జమతే-ఏ ఉల్మా అధ్యక్షులు మహ్మద్ ఖలీమోద్దీన్ వెల్లడించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. హిందు, ముస్లిం, మైనార్టీలందరికీ విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించినట్లే లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.దేశ ప్రజలు సంతోషంగా ఉండాలంటే, రాహుల్గాంధీ ప్రధాని కావాలన్నారు. బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని హెచ్చరించారు.