దొంగతనం నేపం ఎత్తడంతో బాలిక ఆత్మహత్య..

నవతెలంగాణ -నవీపేట్: బాలికపై పక్కింటి వారు దొంగతనం నేపం ఎత్తడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని శివతాండ గ్రామపంచాయతీలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ రాజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం శివతాండ గ్రామానికి చెందిన తేజవత్ లక్ష్మికి నలుగురు కుమార్తెలు ఉండగా మూడవ కుమార్తెను హైదరాబాదులో ఉంటున్న తన భర్త ఇంటికి వదిలేందుకు మంగళవారం తీసుకెళ్ళింది. ఇంటి వద్ద తన చిన్న కుమార్తె వందన(16) భర్త ధను ఉండగా పక్క ఇంటిలోని భానోత్ ప్రవీణ్ తన తల్లికి ఫోన్ చేస్తానని అతని ఫోన్ తీసుకొని మాట్లాడి తిరిగి ఇచ్చింది. ఆ ఫోన్ పౌచ్ లో ఉన్న 600 రూపాయలు వందన దొంగిలించిందని ప్రవీణ్ తో పాటు అతని తల్లి బులి భాయ్ దొంగతనం నేపం ఎత్తి తిట్టడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు మృతురాలి తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజారెడ్డి తెలిపారు.

Spread the love