బాలికలు అన్ని రంగాలలో రాణించాలి :- ఎంపీపీ రజినీ కిషోర్

నవతెలంగాణ – రెంజల్
నేటి సమాజంలో బాలికలు అన్ని రంగాలలో రాణించాలని, బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె పేర్కొన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారని, అలాగే వారి హక్కులు చట్టాలపై అవగాహన కల్పించాలని ఆమె పేర్కొన్నారు. భేటీ బచావో, బేటి పడావో అనే నినాదాలు గ్రామంలో అంగన్వాడీ టీచర్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఎమ్మెస్ రమేష్ కుమార్,, ఎంపీడీవో శంకర్, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, సూపరిండెంట్ శ్రీనివాస్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల రాణి, గ్రామ కార్యదర్శి రాఘవేందర్ రావు, అంగన్వాడి టీచర్లు సురేఖ, సుజాత ,రాజ్యలక్ష్మి, పద్మ, రజిత, వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణమూర్తి, కిషోర్ కుమార్ గంగాధర్, ఉపాధ్యాయులు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Spread the love