మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

నవతెలంగాణ- హైదరాబాద్: మగువలకు బిగ్‌ షాక్‌.. బంగారం ధర..భారీగా పెరిగింది. నిన్నపెరిగిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 73, 760 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 67, 610 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు పెరిగిన నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 100 పెరిగి రూ. 96, 100 గా నమోదు అయింది. అయితే.. మరో ఏడాదిలోపు.. దేశ వ్యాప్తంగా తులం బంగారం ధర 80 వేలు చేరే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.

Spread the love