మళ్లీ పెరిగిన బంగారం ధరలు

నవతెలంగాణ – హైదరాబాద్: బాబోయ్.. బంగారం ధర..మళ్లీ పెరిగింది. నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కూడా పెరిగాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 67, 470 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 61, 860 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 100 పెరిగి రూ. 77, 600 గా నమోదు అయింది. అయితే.. మరో ఏడాదిలోపు.. దేశ వ్యాప్తంగా తులం బంగారం ధర 70 వేలు చేరే ఛాన్స్ ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.

Spread the love